రాజీకి వెళితే తల పగలగొడతారా? | - | Sakshi
Sakshi News home page

రాజీకి వెళితే తల పగలగొడతారా?

Jun 29 2025 2:19 AM | Updated on Jun 29 2025 2:19 AM

రాజీకి వెళితే తల పగలగొడతారా?

రాజీకి వెళితే తల పగలగొడతారా?

దెందులూరు: గతంలో జరిగిన గొడవ పరిష్కారం నిమిత్తం రాజీకి వెళితే తలపగలగొట్టడం ఏం సంప్రదాయమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం టీడీపీ వర్గీయుల దాడిలో తలపగిలి తీ వ్రంగా గాయపడిన ఈదా భార్గవ్‌ను, అతని కుటుంబ సభ్యులను రాయన్నపాలెంలోని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అబ్బయ్యచౌదరి చెప్పారు.

అసలేం జరిగిందంటే..

గత ఆదివారం యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహే ష్‌యాదవ్‌, స్నేహితులు రాట్నాలకుంట వెళ్లి తిరిగి వస్తుండగా రాయన్నపాలెం వద్ద కొంతమంది యు వకులతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీనిపై మహేష్‌యాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహేష్‌ యా దవ్‌పై దాడి చేసిన వారి తల్లిదండ్రులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడంతో మహేష్‌ యాదవ్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీ చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో శనివారం దెందులూరులోని మ హేష్‌ యాదవ్‌కు చెందిన దాబా వద్దకు దాడి చేసిన యువకులు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు మన్నే శ్రీనివాసరావు, బొద్దు సు రేంద్ర, మహేష్‌ యాదవ్‌ అనుచరులు దాడికి పా ల్పడి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలిసిన చింతమనేని హోటల్‌ వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించారు. తర్వాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెదవేగి సీఐ రాజశేఖర్‌ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా దెందులూరు ఎస్సైని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement