రోజువారీ సేవలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రోజువారీ సేవలు బంద్‌

Jun 23 2025 6:57 AM | Updated on Jun 23 2025 6:57 AM

రోజువ

రోజువారీ సేవలు బంద్‌

పర్మినెంట్‌ చేయాలి

ఆప్కాస్‌ విధానాన్ని ఉంచాలి. తీసేయాల్సివస్తే పర్మినెంట్‌ చేయాలనేది ప్రధాన డిమాండ్‌. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయాలి. వేతన సవరణ చేసి పెరుగుతున్న మార్కెట్‌ ధరలకు అనుగుణంగా మాకు కనీస వేతనాలు అందచేయాలి.

– ఉండ్రాజవరపు శ్రీను, ఏకార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తణుకు శాఖ అధ్యక్షుడు

ఉద్యోగ భద్రత కల్పించాలి

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో చాలా కష్టంగా ఉంది. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విధుల్లోకి వచ్చినప్పటి నుంచి ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి.

– గెల్లా విజయకుమార్‌, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ కార్యదర్శి

తణుకు అర్బన్‌ : గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల ఆందోళలనలు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎలాంటి న్యాయం జరగలేదని నిరాహారదీక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని మున్సిపాలిటీల అధికారులు, స్థానిక శాసనసభ్యులకు సమ్మె నోటీసులు అందచేశారు. ఈ నెల 20 నుంచి మునిసిపల్‌ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, చర్చలకు పిలవకపోవడంతో పూర్తిస్థాయి సమ్మెలోకి దిగుతున్నారు. దీంతో ఇంజనీరింగ్‌ విభాగంలోని ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, వాటర్‌ వర్క్స్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, పార్కు మజ్దూర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌, సెక్యూరిటీ, అటెండర్స్‌ సేవలు నిలవనున్నాయి.

2023 డిసెంబర్‌ నెలలో జరిగిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఎక్స్‌గ్రేషియా ఏడు లక్షలకు పెంపు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.75,000, దహన సంస్కారాల ఖర్చులు 20,000, రిటైర్‌మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలు పెండింగ్‌ లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే అమలు చేయాలని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు కోరుతున్నారు.

నిలిచిపోనున్న సేవలు

వాటర్‌వర్క్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో కార్మికులు అందుబాటులో లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా విభాగాల్లో ఏ సమస్య వచ్చినా ఫిర్యాదుచేసిన వెంటనే కార్మికులు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. సమ్మె కారణంగా ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 310 మంది కార్మికులు

భీమవరంతో పాటు తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు మున్సిపల్‌ కార్యాలయాల్లో నగర పంచాయతీగా ఉన్న ఆకివీడులో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 310 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రూ.15 వేలు వేతనం కాగా కేవలం రూ.13,080లు మాత్రమే చేతికి అందుతుంది.

ఆందోళన బాటలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు

నేటి నుంచి పూర్తి స్థాయి సమ్మెలోకి కార్మికులు

సమ్మె ఒప్పందాల్ని అమలు చేయాలని డిమాండ్‌

పశ్చిమలో 310 మంది ఇంజినీరింగ్‌ కార్మికులు

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుంది కదా అనే ఆశతో చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న అంశాన్ని కూడా పట్టించుకోవడంలేదు. మా సమస్యలు ప్రభుత్వం పట్టిచుకోవడంలేదనే ఉద్దేశ్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సివచ్చింది.

– కొపనాతి వెంకటకృష్ణ, నరసాపురం

కార్మికుల ప్రధాన డిమాండ్లు

టెక్నికల్‌ రూ.29,200, నాన్‌ టెక్నికల్‌ రూ.24,500 జీతం అమలుచేయాలి.

షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి

రిటైర్‌మెంట్‌, చనిపోయినా, అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి

ఆప్కాస్‌ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలి

సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలి.

చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలి.

ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీతో పాటు కనీస పింఛన్‌ రూ.10 వేలు ఇవ్వాలి.

విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.

రోజువారీ సేవలు బంద్‌ 1
1/3

రోజువారీ సేవలు బంద్‌

రోజువారీ సేవలు బంద్‌ 2
2/3

రోజువారీ సేవలు బంద్‌

రోజువారీ సేవలు బంద్‌ 3
3/3

రోజువారీ సేవలు బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement