
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: పెద్దింట్లమ్మ నామస్మరణతో కొల్లేటికోట దేవస్థానం ఆదివారం మార్మోగింది. సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, కేశఖండన, లడ్డూ ప్రసాదం, అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.79,710 ఆదాయం వచ్చిందని చెప్పారు.