
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
కౌన్సెలింగ్కు హాజరైన
ఎంటీఎస్ టీచర్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 2008 డీఎస్సీకి సంబంధించిన 191 మంది ఎంటీఎస్ టీచర్లు, 1998 డీఎస్సీకి సంబంధించిన 199 మంది టీచర్లు పాల్గొన్నారు. వీరికి విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాలోని 700 ఖాళీలను చూపారు. సీనియారిటీ ప్రాతిపదికన తొలుత 2008, అనంతరం 1998 ఎంటీఎస్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ను సెంటర్కు దగ్గరగా ఉండే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించకుండా సెంటర్కు దూరంగా ఉన్న జీఎంసీ బాలయోగి సైన్స్పార్కులో ఏర్పాటు చేయడంతో ఎంటీఎస్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే వారి కోసం కేంద్రంలో ఎలాంటి టెంట్లు వేయకపోవడంతో ఎక్కువ మంది తలోదిక్కున, చెట్ల నీడల్లో ఉండాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తమయింది.