రైతులకు కూటమి ప్రభుత్వం దగా | - | Sakshi
Sakshi News home page

రైతులకు కూటమి ప్రభుత్వం దగా

May 4 2025 8:06 AM | Updated on May 4 2025 8:06 AM

రైతులకు కూటమి ప్రభుత్వం దగా

రైతులకు కూటమి ప్రభుత్వం దగా

భీమవరం: ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్సార్‌సీపీ జి ల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దాళ్వా ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, దళారుల ప్రమేయం అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పంట దిగుబడులు బాగున్నా దళారులు, మిల్లర్ల ప్రమేయంతో రైతులు బస్తాకు రూ.400 వరకు నష్టపోతున్నారన్నారు. సంచుల కొరత, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్దకు అధికారులు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేవారని ప్రసాదరాజు, కారుమూరి అన్నారు. అయితే ప్రస్తుతం దళారులు, మిల్లర్ల ప్రమేయంతో పట్టుబడులు ముందు కు సాగడం లేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రకటించడంతో రైతుల్లో ఆందోళనలు రేకెత్తించి దళారులు అయినకాడికి దో చుకుంటున్నారని విమర్శించారు. సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు రైతుల గో డు పట్టడం లేదని దుయ్యబట్టారు. సంచుల కొరత, తేమశాతం పేరుతో రైతులు దోపిడీకి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో రైతు లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట పడుతుందని హెచ్చరించారు.

మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనాలి

జిల్లాలో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యాన్ని పూ ర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తేమ శా తం, ముక్క పేరుతో రైతులను వేధించకుండా చ ర్యలు తీసుకోవాలని, ధాన్యం డబ్బులు వెంటనే చె ల్లించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డి మాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, ఉండి, పాలకొల్లు సమన్వయకర్తలు పీవీఎల్‌ నర్సింహరాజు, గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, నాయకులు బంధన పూర్ణచంద్రరావు, గాదిరాజు రామరాజు, చవాకులు సత్యనారాయణ, జల్లా కొండయ్య, చిగురుపాటి సందీప్‌, కోడే యుగంధర్‌, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, పెనుమాల నర్సింహస్వామి, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం

రైతుల ఇబ్బందులు జేసీకి వివరించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement