జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శశి విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శశి విద్యార్థుల ప్రతిభ

Jun 3 2025 6:53 AM | Updated on Jun 3 2025 6:53 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శశి విద్యార్థుల ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శశి విద్యార్థుల ప్రతిభ

తాడేపల్లిగూడెం (టీఓసీ) : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025లో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు ఆలిండియా ర్యాంక్‌లు సాధించినట్లు విద్యా సంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఎస్‌కే ఆజాం ఖాన్‌ ఆలిండియా 16వ ర్యాంక్‌ సాధించినట్లు వెల్లడించారు. ఎ.ప్రసాద్‌ 4,111, పి.శ్రీలేఖ 4,915, పి.చరణ్‌ 6,058, కె.దేవిక 6,637, వి.హరిచరణ్‌ 12,259 ర్యాంక్‌లు వచ్చాయని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్‌తో పాటు విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్ర కృష్ణ, అకడమిక్‌ డైరక్టర్‌ క్రాంతి సుధలు అభినందించారు.

విద్యా శాఖ అధికారుల బాధ్యతల స్వీకరణ

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నలుగురు అధికారులు సోమవారం విధుల్లో చేరారు. జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌–2గా ఎన్‌. వెంకటప్పయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఏ.జయలక్ష్మి, పరీక్షల విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా వి.సుధాకర్‌, డీఈఓ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌గా కే.పావని బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement