
ఆడబిడ్డలకు ద్రోహం
మెట్ట రైతులను ఆదుకోవాలి
గత ఆరు నెలలుగా సరైన గిట్టుబాటు ధర లేక మెట్ట రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురునాథరావు అన్నారు. IIలో u
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో మహిళా ఓటర్లు 7,51,313 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు 1,26,061 మంది ఉండగా వారిలో మహిళలు 60 శాతం ఉంటారని అంచనా. ఈ మేరకు ఓఏపీ లబ్ధిదారులు 75,636 మంది ఉండగా, వితంతు 49,564, ఒంటరి మహిళ 6,926, అభయహస్తం 8,908, దివ్యాంగులు సుమారు 14,000 మంది కలిపి మహిళా లబ్ధిదారులు 1,55,034 మంది ఉన్నారు. వీరిని మినహాయించిన కూటమి మేని ఫెస్టో మేరకు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకానికి 5,96,279 మంది అర్హులు ఉన్నారని అంచనా. ఈ మేరకు నెలకు రూ. 89.44 కోట్లు చొప్పున ఏడాది కాలానికి గాను రూ.1,073 కోట్లు మేర ప్రభుత్వ సాయాన్ని ఆడబిడ్డలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ పథకం మాటెత్తకపోగా ఎప్పటి నుంచి అమలుచేసేది సర్కారు స్పష్టతనీయడం లేదు.
గత ప్రభుత్వంలో మహిళలకు పట్టం
కులమతవర్గాలు, రాజకీయాలకు అతీతంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆడపడుచులకు అండగా నిలిచింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 2,70,380 మంది డ్వాక్రా మహిళలకు రూ.1,107 కోట్ల రుణాలను మాఫీ చేశారు. బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 18,750 చొప్పున జిల్లాలో సగటున 61,750 మందికి నాలుగేళ్లలో రూ.463.41 కోట్ల సాయాన్ని అందించారు. కాపునేస్తం పథకం కింద కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గానికి చెందిన సుమారు 28,004 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.168.02 కోట్లు అందజేశారు. ఈబీసీ నేస్తం పథకం కింద రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య తదితర ఓసీ సామాజికవర్గాల్లోని 12,827 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ. 57.71 కోట్లు సాయం అందించారు.
న్యూస్రీల్
కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. సంపద సృష్టి తెలిసిన పార్టీ మా పార్టీ.. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకువస్తున్నాం.. ప్రతి మహిళను మహాశక్తిగా తయారుచేయాలన్నదే నా సంకల్పం.. అందుకే ఆడబిడ్డ నిధి పథకాన్ని తెస్తున్నాం.. ఇంటిలో ఇద్దరుంటే.. ఇద్దరి అకౌంట్లకు కూడా ఇస్తాం.. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఈ రోజు మీ అన్న మీకు వరం ఇస్తున్నాడు.
– ఇవి సార్వత్రిక ఎన్నికల సభల్లో చంద్రబాబు చెప్పిన మాటలు
ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్కల్యాణ్, కూటమి నేతలు ఎక్కడకు వెళ్లినా ఆడబిడ్డ నిధి అంటూ ఊదరగొట్టారు. తమ ప్రభుత్వం రావడమే ఆలస్యం డబ్బులు ఖాతాల్లోకి వస్తాయంటూ హోరెత్తించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండగా ఆడబిడ్డ నిధి అమలు ఊసెత్తడం లేదు. మరోపక్క ఈ పథకం సాయం కోసం పేదింటి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మోసం ఇంతింతై!
ప్రభుత్వం రాగానే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి హామీ
19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,500
పథకం అమలు ఊసెత్తని ప్రభుత్వం
జిల్లాలో అర్హులు సుమారు 5.96 లక్షల మంది
ఏడాది కాలానికి రూ.1,073 కోట్లు నష్టపోయిన జిల్లాలో మహిళలు
ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో మహిళలకు అండగా జగన్ సర్కారు
హామీలు నిలబెట్టుకోవాలి
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలులోకి తేవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున బ్యాంకు ఖాతాకు జమచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు.
– బందెల ప్రమీల, గృహిణి, చెరుకువాడ
సూపర్ దగా
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై క్లారిటీ లేదు. సూపర్ సిక్స్ అంటూ వచ్చి ప్రజల్ని సూపర్గా దగా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పేదలందరినీ మాజీ సీఎం జగన్ ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం వంచన తప్ప చేసిందేమీ లేదు.
– కోడే విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ
జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, భీమవరం

ఆడబిడ్డలకు ద్రోహం

ఆడబిడ్డలకు ద్రోహం

ఆడబిడ్డలకు ద్రోహం

ఆడబిడ్డలకు ద్రోహం