
వక్ఫ్బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకుంటే ఉద్యమాలు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషాద్ మొహిద్దీన్ హెచ్చరించారు. పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తన మిత్ర పక్షాలతో కలిసి కుట్ర చేసి లక్షలాది, కోట్ల రూపాయలు విలువైన వక్ఫ్ భూములను స్థానిక అధికారులకు కట్టబెట్టే విధంగా చూస్తూ, ఓ మతాన్ని నష్టపరిచడం చాలా అన్యాయం అన్నారు. పార్లమెంట్లో బిల్లుకు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం ముస్లింలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ముస్లిం హక్కులను కాపాడుతానని చెప్పి, ఇప్పుడు ముస్లింల విశ్వాసానికి వ్యతిరేకంగా వ్యహరించడం శోచనీయం అని అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించడం హర్షం వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించాలని కోరారు.