
బాలలను పనిలో పెట్టుకోవద్దు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు
విద్యారణ్యపురి: బాలలను పనిలో పెట్టుకోవద్దు.. వారితో పనిచేయించుకునేవారు చట్టపరంగా శిక్షార్హులవుతారని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన హనుమకొండలోని జెడ్పీహాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల వయసు వరకు బాలకార్మికులే.. ఆ వయసు వారు పనుల్లో కనబడి తే దగ్గరలోని సామాజిక సహాయ సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో హనుమకొండ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి క్షమాదేశ్పాండె, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.రాము, గవర్నమెంట్ ప్లీడర్ కె.నర్సింహారావు, అసిస్టెంట్ కమిషన ర్ ఆఫ్ లేబర్ నారాయణ స్వామి, డీడబ్ల్యూఓ జయంతి, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, ఎఫ్ఎంఎం ఎన్జీఓ డైరెక్టర్ సహాయసిస్టర్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ పి.ఫిలిప్రాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్ను
వినియోగించుకోవాలి
వరంగల్ క్రైం: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాల ని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. చిన్న కేసులతో కక్ష పెంచుకుని కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నా రు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, రాజీపడదగిన కేసుల్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, రాజీపడాలని అనుకునే వారు పోలీస్ అధికారులను సంప్రదించాలని కోరారు.