నేర రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నేర రహిత సమాజమే లక్ష్యం

Jun 1 2025 1:04 AM | Updated on Jun 1 2025 1:04 AM

నేర రహిత సమాజమే లక్ష్యం

నేర రహిత సమాజమే లక్ష్యం

పరకాల ఏసీపీ సతీష్‌బాబు

పరకాల: నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరకాల ఏసీపీ సతీష్‌బాబు కోరారు. అసాంఘిక శక్తులు శాంతి భ ద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. పోలీసులు, ర్యాఫిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని బీసీ కాలనీ నుంచి పరకాల బస్టాండ్‌ వరకు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా నిలవాలని కోరారు. ఏఆర్‌ఎఫ్‌ అధికారి సరస్వతి, పరకాల, శాయంపే ట, ఆత్మకూరు సీఐలు క్రాంతికుమార్‌, రంజిత్‌రా వు, సంతోష్‌, ఎస్సైలు శివకృష్ణ, రమేష్‌, పరమేశ్వర్‌, కొంక అశోక్‌, తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement