
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో రెండు డివిజన్ల పరిధిలోని ప్రధాన నాలాతో పాటు రైల్వేట్రాక్ వైపు, మేదరి బస్తీ వద్ద ఉన్న డ్రెయినేజీల పరిస్థితిని పరిశీలించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సీపీలు రవీందర్, వాడేకర్, శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, టీపీఎస్ శ్రీకాంత్, ఏఈ ముజామిల్ పాల్గొన్నారు.