వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

May 29 2025 1:03 AM | Updated on May 29 2025 1:03 AM

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

ధర్మసాగర్‌: వైద్యసిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఏ.అప్పయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్‌లలో పలు రికార్డులను పరిశీలించి ఏఎన్‌ఎంలు, ఆశాలకు దిశానిర్దేశం చేశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేయించేలా చూడాలన్నారు. టీబీ కేసులకు క్రమం తప్పకుండా మందులను అందించి వేయించాలని, రోజూ సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించి మందులు ఇవ్వాలని తెలిపారు. కేన్సర్‌ రోగుల దగ్గరకి వెళ్లి రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా లేదా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.అరుణ, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ నెహ్రూచంద్‌ నాయక్‌, పల్లె దవాఖాన మెడికల్‌ ఆఫీసర్లు మహేందర్‌, అలేఖ్య, శృతి, భారతి, రుచిత, కవిత, శ్వేత, సూపర్‌వైజర్‌లు ప్రసన్న కుమారి, రామ్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement