
ఏపీ పీజీసెట్లో విజయకేతనం
విజయనగరం అర్బన్/బొబ్బిలిరూరల్: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీసెట్–2025లో విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జియాలజీ సబ్జెక్టులో మహరాజా అటానమస్ కళాశాలకు చెందిన డి.నవీన్ ఫస్ట్, వై.ఈశ్వర్గేయ సెకెండ్ ర్యాంకులు సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సాంబశివరావుతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు టి.శంకరరావు, కె.సత్యనారాయణ నాయుడు, జియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.గణపతిరావు గురువారం అభినందించారు.
● బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన చింతల గౌరీశ్వరి తెలుగు సబ్జెక్టులో 88 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆమెను తల్లిదండ్రులు చింతల సత్యం,
అనసూర్యతో పాటు గ్రామస్తులు అభినందించారు.

ఏపీ పీజీసెట్లో విజయకేతనం

ఏపీ పీజీసెట్లో విజయకేతనం