
ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళలకు గాయాలు
చీపురుపల్లి: పట్టణంలోని రాజాం రోడ్లో వెదుళ్లవలస జంక్షన్ వద్ద ఆటో బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు గాయలయ్యాయి. ఇద్దరిలో సవరపు సావిత్రికి తీవ్రగాయాలు కాగా గుంప సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్న ఆటోలో గరివిడి మండలానికి చెందిన సవరపు సావిత్రి, విజయనగరానికి చెందిన గుంప సావిత్రితో పాటు మరికొంత మంది ప్రయాణికులు ఉన్నారు. రైల్వేస్టేషన్ దాటిన తరువాత వెదుళ్లవలస జంక్షన్ వద్ద ఎదరుగా మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనం రావడాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. దీంతో బొండపల్లికి చెందిన సవరపు సావిత్రి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే విజయనగరానికి చెందిన గుంప సావిత్రికి స్వల్ప గాయలయ్యాయి. దీంతో ఆ ఇద్దరినీ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తీవ్ర గాయాల పాలైన సవరపు సావిత్రిని అత్యవసర వైద్యం నిమిత్తం విజయనగరం రిఫర్ చేశారు.
13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి..స్థానిక సీత చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8,860 నగదు సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడిపందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఏగోటివలస పొలాల్లో
ఏనుగుల గుంపు
సీతానగరం: మండలంలోని కోట సీతారాంపురంలో నాలుగు రోజులుగా తిష్ఠవేసిన ఏనుగుల గుంపు శుక్రవారం ఏగోటివలస పొలాల్లో సంచరిస్తున్నాయని గ్రామస్తులు తెలియజేశారు. కోట సీతారాంపురం గ్రామానికి వచ్చిన 8 ఏనుగుల గుంపు 9కి చేరడంతో తాజాగా 9 ఏనుగుల గుంపు ఏగోటివలస పొలాల్లో సంచరిస్తున్నాయి. కోటసీతారాంపురం రైతు కె.రత్నాకర్ పొలంలో మొక్కలు ధ్వంసం చేయడంతో నష్టం వాటిలిందని తెలియజేశారు. ఇక్కడి పొలాల్లో ఏనుగులు ఏమేరకు నష్టాల్ని తెస్తాయోనని చెరకు, మామిడిరైతులు ఆందోళన చెందుతున్నారు.
20 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారాను తరలిస్తున్న ఓ వ్యక్తి పట్టుబడినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు తన కార్యాలయం వద్ద సీఐ విలేకరులతో మాట్లాడుతూ పట్టుబడిన వ్యక్తికి సారాను సరఫరా చేసిన మరో వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జియ్యమ్మవలస మండలంలో గల పెదతుంబలి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా గ్రామ కమిటీ తీర్మానం మేరకు ప్రకటించినట్లు సీఐ పేర్కొన్నారు.

ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళలకు గాయాలు