
విద్యుత్షాక్తో లైన్మన్ మృతి
శృంగవరపుకోట: ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ఆ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్మన్ మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం జామి మండలంలోని సోమయాజుల పాలెం గ్రామంలో జరిగింది. శాసనాపల్లి సచివాలంయలో జూనియర్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న షేక్ రహ్మాన్ శుక్రవారం సోమయాజులపాలెంలో విద్యుత్ పోల్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు, విద్యుత్ సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం వచ్చిందని, కుటుంబానికి ఆసరాగా కొడుకు ఉన్నాడని, మురిసిపోయామని, తమ ఆనందం మూడు రోజులు ముచ్చటే అయ్యిందని, ఇక తమకు దిక్కెవరంటూ మృతుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలిచివేసింది.
చికిత్స పొందుతూ వృద్ధుడు..
లక్కవరపుకోట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలో గల కేజీహెచ్లో చికిత్స పొందుతూ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన పెదగాడ అప్పారావు(77) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన ఎల్.కోట జంక్షన్ నుంచి అప్పారావు సోంపురం వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అప్పారావును విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

విద్యుత్షాక్తో లైన్మన్ మృతి