అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో ‘విఘ్నేష్‌’ సత్తా | - | Sakshi
Sakshi News home page

అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో ‘విఘ్నేష్‌’ సత్తా

Jun 12 2025 2:59 AM | Updated on Jun 12 2025 2:59 AM

అండర్

అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో ‘విఘ్నేష్‌’ సత్తా

దూసుకుపోతున్న తెర్లాం యువకుడు

ముంబైలో జరుగుతున్న టోర్నమెంట్‌

టోర్నమెంట్‌లో రెండు సెంచరీలు,

ఒక హాఫ్‌ సెంచరీ

రెండు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు,

మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ కై వసం

తెర్లాం: ముంబైలో జరుగుతున్న అండర్‌–14 క్రికెట్‌ టోర్నమెంట్‌లో తెర్లాం మండలం ఎన్‌.బూర్జవలస గ్రామానికి చెందిన యువకుడు పైల విఘ్నేష్‌ రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ చేసి సత్తా చాటాడు. టోర్నమెంట్‌లో ఓ జట్టు తరుఫున విఘ్నష్‌ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో రెండుసార్లు మేన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, టోర్నమెంట్‌లో బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. ఒక మ్యాచ్‌లో 91 బంతుల్లో 104 పరుగులు, మరో మ్యాచ్‌లో 62 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబైలో పలు రాష్ట్రాలకు చెందిన క్రికెట్‌ అకాడమీలు నిర్వహించే టోర్నమెంట్‌లో విఘ్నేష్‌ ఈ ఘనతను సాధించాడు. అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీల్లో రాణిస్తున్న విఘ్నేష్‌ను మండలానికి చెందిన పలువురు అభినందించారు. విఘ్నేష్‌ తండ్రి పైల గణపతి ఎన్‌.బూర్జవలస పంచాయతీ సర్పంచ్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో ‘విఘ్నేష్‌’ సత్తా1
1/1

అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో ‘విఘ్నేష్‌’ సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement