
నిజజీవితంలో స్మార్ట్ స్కిల్స్ అవసరం
● జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి
విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధి పనిలోనే కాకుండా నిజ జీవితంలో కూడా స్మార్ట్ స్కిల్స్ అవసరమని జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి అన్నారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో ‘స్మార్ట్ స్కిల్స్ ఫర్ ఏ సెక్యూర్ ఫ్యూచర్’ అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో బుధవారం నిర్వహించిన వర్క్షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చెందేందుకు వయస్సుతో సంబంధం లేదన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సాఫ్ట్స్కిల్స్పై నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ఈసీఈ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.హేమ పర్యవేక్షణలో వర్క్షాప్ రి సోర్స్ పర్సన్స్గా ఎస్బీఐఎల్డీ చీఫ్ మేనేజర్ (ఫ్యాకల్టీ) సురేష్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ వి.అభినాష్, డాక్టర్ కె.శ్రీకాంత్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.రాజేశ్వరరావు, ఎస్బీఐ అధికారులు, ఎం.సురేష్ బాబు, ఎ.శ్రీనివాసరావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.