బడి చుట్టూ.. సమస్యల దడి | - | Sakshi
Sakshi News home page

బడి చుట్టూ.. సమస్యల దడి

Jun 12 2025 2:58 AM | Updated on Jun 12 2025 2:58 AM

బడి చ

బడి చుట్టూ.. సమస్యల దడి

విజయనగరం వినాయక్‌ నగర్‌ జొన్నగుడ్డి నగర పాలక ఉన్నత

పాఠశాలలో పేరుకుపోయిన మురుగునీరు

యూనిఫారం లేని

‘విద్యార్థి మిత్ర’ కిట్‌

కొన్ని స్కూళ్లకు ఇంకా

చేరని సన్నబియ్యం

నిలిచిపోయిన ‘మన బడి.. మన భవిష్యత్‌’ నిధులు

అసంపూర్తిగా దర్శనమిస్తున్న పాఠశాల భవనాలు

విజయనగరం అర్బన్‌:

వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. బడికి వెళ్లేందుకు విద్యార్థులు చకచకా ముస్తాబవుతున్నారు. వీరికి పలు సమస్యలతో స్వాగతం పలికేందుకు సర్కారు బడులు రెడీ అయ్యాయి. అధ్వాన పరిసరాలు, మూలకు చేరిన ఆర్వో ప్లాంట్‌లు, అసంపూర్తి భవన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. నాడు–నేడు నిధులతో స్కూళ్ల ప్రారంభ సమయానికి ముస్తాబు కావాల్సిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

‘మన బడి.. మన భవిష్యత్తు’ అభివృద్ధి పనులు నిధులులేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో శతశాతం పాఠశాలలకు గత ప్రభుత్వం సమకూర్చిన తాగునీటి వ్యవస్థలు నిర్వహణలోపంతో పలుచోట్ల మూలకు చేరాయి. వీటిని బాగుచేయాలని ఉపాధ్యాయులు మొత్తుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.

‘యూనిఫారం’ లేని విద్యార్థిమిత్ర కిట్‌లు..

జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో చదువుతున్న 1,17,683 మంది విద్యార్థులకు పాఠశాలల పునఃప్రారంభం రోజున పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్‌ (విద్యాకానుక)లలో కొన్ని మాత్రమే వచ్చాయి. యూనిఫాంలు పూర్తిగా రాలేదు. బెల్ట్‌లు, నోట్‌ పుస్తకాలు మినహా మిగిలినవన్నీ అరకొరగా వచ్చాయి. దీంతో తొలిరోజున కొందరికే విద్యార్థిమిత్ర కిట్‌లు అందే పరిస్థితి.

కొన్ని స్కూళ్లకే సన్నబియ్యం

స్కూళ్ల ప్రారంభం నుంచే మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామన్నారు. జిల్లాలో వివిధ యాజమాన్యాలకు చెందిన 2,243 స్కూళ్లలో ఇంకా 20 శాతం స్కూళ్లకు సన్నబియ్యం చేరలేదు. జిల్లాలో నెలకు అవసరమైన 9,856 బస్తా (25 కేజీల)ల్లో సుమారు వెయ్యిబస్తాలు రావాల్సి ఉంది.

నిలిచిన పనులు

రెండో విడత నాడు–నేడు కింద గత ప్రభుత్వం చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, రన్నింగ్‌ వాటర్‌ సదుపాయంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్‌, పాఠశాలలకు పెయింటింగ్‌, స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌, పాఠశాలల్లో కాంపౌండ్‌ వాల్స్‌, వంటగది నిర్మాణాలు వంటివి తలపెట్టింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి.

బడి చుట్టూ.. సమస్యల దడి 1
1/1

బడి చుట్టూ.. సమస్యల దడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement