
కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా అనుమానితుల శాంపిల్స్ను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ శాంపిల్స్ను విశాఖపట్నం పంపించడం వల్ల నివేదిక రావడంలో జాప్యం జరుగుతోందన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎస్.కోట, గజపతినగరం, రాజాం, చీపురపల్లి ఏరియా ఆస్పత్రుల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసి జూలై నెలఖారు నాటికి అప్పగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. బిల్లుల చెల్లింపులు పెంగింగ్ ఉన్నందున పనులు పూర్తి చేయలేకపోయామని కాంట్రాక్టర్లు తెలపగా.. నిధులు కోసం వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి డీఓ లేఖ రాయాలని డీసీహెచ్ఎస్ ఎన్.పి.పద్మశ్రీ రాణిను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఏపీఎంఎస్ఐడీసీ ఎస్.ఇ.విజయభాస్కర్, ఈఈ శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్