
పైడితల్లికి పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృ తాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
హోంగార్డు కుటుంబానికి ’చేయూత’
● రూ.3 లక్షల చెక్కు అందజేత
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బీవీ రమణమూర్తికి ‘చేయూత’ కింద రూ.3,23,050 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ డీపీఓలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించినా లేదా ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హెూంగార్డ్స్ స్వచ్ఛందంగా ఒకరోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయ మన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కార్యక్రమంలో హెూంగార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
విష జ్వరంతో గిరిజన
విద్యార్థిని మృతి
రామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ మెట్టవలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని పదవ తరగతి చదువుతున్న కుడుమూరు మేఘన(14) విషజ్వరంతో సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ సంఘటనపై మృతురాలి తల్లి సంధ్య తెలిపిన వివరాల ప్రకారం..రెండు రోజులుగా ఆమెతో పాటు కుమారుడు మహేంద్ర విషజ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ డాక్టర్ వద్ద మందులు వాడుతున్నారు. ఇంతలో సోమవారం ఉదయానికి చిన్న కూతురు మేఘన(14)కు కూడా జ్వరం సోకింది. వెంటనే ఆర్ఎంపీని పిలిచి వైద్యపరీక్షలతో పాటు రక్త పరీక్షలు చేశారు. రక్తపరీక్షల్లో మలేరియాతో పాటు పచ్చకామెర్లు సోకినట్లు డాక్టర్ చెప్పగా మందులు కూడా వాడారు. సాయంత్రానికి కూడా తగ్గకపోవడంతో డాక్టర్ సూచన మేరకు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి జ్వరం విషమించింది వెంటనే విజయనగరం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తండ్రి సన్యాసిరావు మేఘనను 108లో విజయనగరం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మేఘన మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చాక చూసిన కుటుంబసభ్యులు అమ్మా వేసవి సెలవులకు వచ్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా? అంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. జ్వరం వచ్చిన ఒక్కరోజులోనే మృతి చెందడమేంటని గ్రామస్తులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మేఘన కొటికిపెంట ఏకలవ్య పాఠశాలలో చదువుతోంది. ఆమె తమ్ముడు మహేంద్ర గొట్లాం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. మృతురాలి అక్క సాలూరులో నర్సు శిక్షణ తీసుకుంటోంది.

పైడితల్లికి పుష్పార్చన

పైడితల్లికి పుష్పార్చన