
అంతా గందర గోళం
విజయనగరం అర్బన్: జిల్లాలోని పదోతరగతి,
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 198 మంది విద్యార్థులకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ పురస్కారాల ప్రదానం గందరగోళంగా సాగింది. పేరు ఒకరిని పిలిచి, మరొకరికి హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా పురస్కార పత్రాలు అందజేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తికమకపడ్డారు. 198 మందిలో పదో తరగతికి చెందిన వారు 158 మంది, ఇంటర్మీడియట్కి చెందిన వారు 40 మంది ఉన్నారు. అవార్డులు అందుకున్న పదోతరగతి విద్యార్థుల్లో 93 మంది ప్రభుత్వ, 65 మంది ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారు కాగా, ఇంటర్మీడియట్ విద్యార్థులు 40 మందిలో ప్రభుత్వ కళాశాలకు చెందిన వారు 11 మంది, ప్రైవేటు కళాశాలలకు చెందిన వారు 29 మంది ఉన్నారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎమ్మెల్యేలు అతిథిగజపతిరాజు, లోకం నాగమాధవి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీవీఈఓ ఎస్.తవిటినాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ ఎ. రామారావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.