
జర్నలిస్ట్ వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరిస్తూ వేజ్బోర్డు చట్టాల్ని పరిరక్షించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు ధరించి స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపులు, ఇతర సదుపాయాలకు వేతన బోర్దులు ఏర్పాటైన 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు ప్రసావనకు రాకుండా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్నాయుడు, మురళి, శంకర్రావు, అప్పారావు, ప్రసాదరావు, గొర్లె సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.