
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
రామభద్రపురం: మండలంలోని అప్పలరాజు పేట గ్రామానికి చెందిన వృద్ధురాలు బాడంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బెవర సింహాచలం (65) ఆదివారం మధ్యాహ్నం కడుపునొప్పి తాళలేక గడ్డిమందు తాగేసింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియగా వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.