
జాతీయలోక్ అదాలత్లో క్లెయిమ్ల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరం లీగల్: మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్లను జాతీయలోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు హాల్లో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 5న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ అదాలత్లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్లు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల
సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీహెచ్ విజయ్కుమార్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని విభిన్న ప్రతిభావంతులకు వర్తింప జేయాలని కోరారు. సుదూర ప్రాంతాలకు 50 శాతం రాయితీ వర్తింప జేయాలని, ఆర్టీసీలో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జీఓ నంబర్ 77 ప్రకారం 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిర్వహిస్తున్న షాపుల్లో 5శాతం షాపులను విభిన్న ప్రతిభావంతులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు.
ముగ్గురికి గాయాలు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి సరితి వారి కళ్లాల వద్ద జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు పెదమానాపురం హెడ్ కానిస్టేబుల్ కాశీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న కారును పెదమానాపురం నుంచి రామభద్రపురం వెళ్తున్న కారు ఢీకొనడంతో రెండు కార్లలో ఉన్న ఆగూరి సంతోషి, పువ్వల రవిబాబు, పువ్వల శాంతమ్మలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జాతీయలోక్ అదాలత్లో క్లెయిమ్ల పరిష్కారం