
ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రావెల్ దందా!
బొబ్బిలి:
పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రోత్ సెంటర్ భూములు ఇప్పుడు గ్రావెల్ దందాకు అడ్డాగా మారాయి. గ్రోత్సెంటర్లోని ప్రధాన రహదారిలో నారాయణపురం వెళ్లే దారి మలుపు లో ఉన్న పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో గ్రావెల్ తవ్వకాలు జరిపి నిల్వ కేంద్రంగా చేసుకున్నారు. అక్కడి నుంచి వివిధ వ్యాపారాలకు గ్రావెల్ను తరలిస్తున్నారు. దీనిని చిత్రీకరించేందుకు స్థానిక విలేకర్లు వెళ్లగా ఈ వ్యవహారం ఎమ్మెల్యే గారిదని, ఏం రాయొద్దని పీఏ హర్ష ముందుగా చెప్పారు. అనంతరం మిగతా వారికి కూడా చెప్పాలని అప్పుడు రాయడం మానేస్తామ ని అనగా నాకేటి దూ... మీకు ఏ అవసరాలు రావా? అప్పుడు చూద్దాం అని పీఏ హర్ష దురు సుగా మాట్లాడటంతో ఆ విలేకరి చిన్నబుచ్చుకున్నారు. ఇటీవల ఆర్డీవో సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్ విషయంలో కూడా ఎమ్మెల్యే పీఏ తహసీల్దార్ ఎం.శ్రీనుతోనూ దురుసుగా ఫోన్లో మాట్లాడా రని ఈ సందర్భంగా పట్టణంలో చర్చించుకుంటున్నారు. గ్రోత్ సెంటర్లోని గ్రావెల్ దందాకు వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించినట్టు తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు.
● ప్రశ్నించిన విలేకరులకు బెదిరింపులు

ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రావెల్ దందా!