
ఏపీఈఏపీ సెట్లో సత్తా చాటిన విద్యార్థులు
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ డిగ్రీ కోర్సులకు ఇటీవల నిర్వహించి న ఏపీఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్ష ఫలితాలలో పలువురు జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు లభించాయి. ఇంజినీరింగ్ విభాగంలో జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న 11,110 మందిలో 10,749 మంది పరీక్ష రాయగా 7,925 మంది క్వాలిఫై అయి నట్టు నివేదికలో వెలువడింది. అదే విధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో జిల్లా నుంచి దర ఖాస్తు చేసుకున్న 4,305 మందిలో 4,004 మంది పరీక్ష రాయగా 3,434 మంది క్వాలిఫై అయ్యారు. ఆదివారం రాత్రి విడుదల అయిన ఫలితాలలో ఇంతవరకు సేకరించిన ర్యాంక్ల వివరాలు ఇలా ఉన్నా యి. ఇంజినీరింగ్ విభాగంలో పట్టణానికి చెందిన బలగ జయేంద్రనాయుడుకి 212 ర్యాంక్, మజ్జి జ్ఞాన హాసినికి 846 ర్యాంక్, బులుసు వినేష్కి 1,420, బెల్లాన షాన్ సువర్ణ రత్నాకర్కి 1,752వ ర్యాంక్లు వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో పట్టణానికి చెందిన సాయి శిరీష్ 926, లోపింటి జాహ్నవి 1,592 ర్యాంక్ సాధించారు.
ఆరికతోట విద్యార్థి సత్తా..
రామభద్రపురం: ఏపీఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలలో మండలంలోని ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగేశ్వర్ రాష్ట్ర స్థాయిలో 41వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతంలో జేఈఈ మెయిన్స్ జాతీయ స్థాయి ఓబీసీ కేటగిరీలో 40వ ర్యాంకు, కామన్ కేటగిరీలో 284వ ర్యాంకు సాంధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థి తండ్రి సింహాచలం ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పని చేయగా తల్లి యర్రయ్యమ్మ గృహిణి.

ఏపీఈఏపీ సెట్లో సత్తా చాటిన విద్యార్థులు

ఏపీఈఏపీ సెట్లో సత్తా చాటిన విద్యార్థులు

ఏపీఈఏపీ సెట్లో సత్తా చాటిన విద్యార్థులు

ఏపీఈఏపీ సెట్లో సత్తా చాటిన విద్యార్థులు