
రైతులంతా ఒక్కటై...
రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న సాయన్న చానల్ తిరుగుడు గెడ్డ షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో నీటి అదుపు లేక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు రైతులు పలుసార్లు విన్నవించినా స్పందించలేదు. ఖరీఫ్ వచ్చేయడంతో చేసేది లేక రైతులే స్వయంగా షట్టర్లు మరమ్మతులు చేసేందుకు ముందుకొచ్చారు. పుర్లి ఎంపీటీసీ కురిటి రామకోటి, మాజీ
ఎంపీటీసీ పాలవలస సూర్యారావు, ఖండ్యాం నీటి సంఘం ప్రాదేశిక సభ్యుడు పాలవలస ప్రసాద్
అంతా కలిసి రూ.1.50లక్షలు ఖర్చు చేసి మూడు షట్టర్లను తయారు చేయించి తిరుగుడు గెడ్డ వద్ద ఆదివారం అమర్చారు. – రేగిడి