
పకడ్బందీగా డీఎస్సీ
● పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం అర్బన్: డీఎస్సీ పరీక్షను పకడ్పందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానిక ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అభ్యర్థులకు అక్కడ కల్పించిన వసతులు, పరీక్ష నిర్వహణ, బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఇన్చార్జి తహసీల్దార్ స్వర్ణకూమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.