
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 శ్రీ200
డీపీవోలో పోలీస్ వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: పోలీసు శాఖలో పలు హోదాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ డీపీవోలో పోలీసు వెల్ఫేర్ డేను శుక్రవారం నిర్వహించారు. సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నా రు. సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి బ్బంది వినతులు పరిశీలించిన ఎస్పీ త్వరితగతి న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాన ని సిబ్బంది, అధికారులకు భరోసా ఇచ్చారు.
బొబ్బిలి విద్యార్థులకు జాతీయ పతకాలు
బొబ్బిలి: ఒడిశాలోని కటక్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మే 30 నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బొబ్బిలి క్రీడాకారులు జాతీయ పతకాలు సాధించినట్టు కోచ్ సుధాకర్యాదవ్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో బొబ్బిలికి చెందిన 17 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీలలో గెలుపొందారన్నారు. బంగారు పతకాలు ముగ్గురికి, కాంస్య పతకాలు 9 మందికి, వెండి పతకాలు ఐదుగురికి లభించాయన్నారు. వీరిలో జ్ఞానదీపక్ తన ప్రత్యర్థిపై రెండు రౌండ్లలోనూ 16–0, 13–0 స్కోర్లతో గొప్ప విజయం సాధించినట్టు చెప్పారు. జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే బేబీ నాయన, డీఎస్పీ జి.భవ్యా రెడ్డి అభినందించినట్టు చెప్పారు.
తేనేటీగల దాడిలో పలువురికి గాయాలు
రేగిడి: మండల పరిధి కొమెర వెంకటాపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులుపై తేనేటీగలు శుక్రవారం దాడి చేశాయి. కాలువల్లో పనులు చేస్తుండగా తుప్పులకు ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో వేతనదారులు పరుగులు తీశారు. అప్పటికే పలువురి వేతనదారులు తీవ్రంగా గాయపడడంతో ఫీల్డ్ అసిస్టెంట్ రేగిడి రమణ 108కు సమాచారం అందించారు. రేగిడి, పాలకొండ 108 సిబ్బంది రెండు వాహనాల ద్వారా గ్రామానికి చేరుకుని దాడిలో గాయపడిన బట్న జగన్నాథం, ఇందిరాపు రత్నాలమ్మ, వెంపటాపు సూర్యనారాయణ, బట్న రాజేష్, అరసవిల్లి గౌరమ్మ, అరసవల్లి దుర్గారావులతో పాటు మరి కొందరిని ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు, పైలెట్ జి.నారాయణరావు, వెంకటరమణలు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
జిల్లా కేంద్రంలో రెండు చోట్ల చోరీ
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో కొత్తవలస ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న శ్రీరంగ మోటార్ మహేంద్ర ట్రాక్టర్ షోరూం, శ్రీ వాసవీ లారీ యూనియన్ కార్యాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్టు పట్టణ ఎస్ఐ జగదీష్నాయుడు శుక్రవారం తెలిపారు. ఈ చోరీ ఘటనలో ట్రాక్టర్ షోరూంలో రూ.80వేల నగదు అపహరించినట్టు తెలిపారు. దుండగలు ముందు లారీ యూనియన్ కార్యాలయంలో చోరీకి పాల్పడినట్టు అక్కడ ఏమీ లేకపోవడంతో పక్కనే ఉన్న ట్రాక్టర్ షోరూంలోకి వెనుక భాగం నుంచి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు పేర్కొన్నారు. బాధితుడు బోటు గంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నామని, చోరీకి పాల్పడిన ఇద్దరు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు.

చికెన్

చికెన్

చికెన్