
88 గ్రామాల్లో కుటుంబ సర్వే చేయాలి : పీవో
సీతంపేట: ఐటీడీఏ పరిధిలోని 88 గిరిజన గ్రామాల్లో కుటుంబ సర్వే చేయాలని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. వివిధ మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులతో శుక్రవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తప్పుల సవరణ, భూమి పట్టాలు ఉన్నాయా లేదా, ఉంటే కరెక్షన్ ఏమైనా చేయాలా?, కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువపత్రం వంటివి తీసుకోవాల్సినవి పెండింగ్లో ఉన్నాయనేది సర్వే చేయాలన్నారు. ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, వారి జీవన విధానం తదితర వివరాల సర్వే ఈ నెల 13వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు అన్ని శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లో క్యాంపయిన్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.