
● కలశ యాత్ర
రాజాం మండలం గార్రాజుచీపురుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంతో పాటు నవగ్రహ దేవాలయాల ప్రతిష్ఠోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రతిష్ఠా సంకల్పం, వినాయకపూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, పంచగవ్యారాధన, యాగశాల ప్రవేశం, మండల మండపారాధన, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహాలతో పాటు పసుపు నీటితో కూడిన కలశాలను ఊరేగింపుచేశారు. ఇందులో
వందలాదిమంది మహిళలు పాల్గొన్నారు. – రాజాం