జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌

Jun 6 2025 12:48 AM | Updated on Jun 6 2025 12:48 AM

జాతీయ

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌

బొబ్బిలి: ప్రముఖ జాతీ య పత్రిక కా ర్టూన్‌ వాచ్‌ రా యపూర్‌లో గురువారం నిర్వహించిన జాతీయస్థాయి కార్టూన్స్‌ ప్రదర్శనలో బొబ్బిలి పట్టణా నికి చెందిన కార్టూనిస్ట్‌ గుంట్రెడ్డి భాస్కరరావు వేసిన కార్టూన్‌ను ప్రదర్శించారు. ప్లాస్టిక్‌ భూ తంలో కూరుకు పోతున్న భూమిని పచ్చదనంతో రక్షించాలనే సందేశాన్నిస్తున్న ఈ కార్టూన్‌ పలువురి ప్రశంసలు పొందిందని భాస్కరరావు(భాను) ఈ సందర్భంగా తెలిపారు.

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కొత్తవలస: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని విజిలె న్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ సింహాచలం మాట్లాడుతూ కొత్తవలస మండలంలోని వీరభద్ర పురం, దాసరివానిపాలెం గ్రామాల నుంచి ఆటోలో పీడీఎప్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల పరిధిలో మాటువేసినట్లు చెప్పారు. దాసరివాని పాలెం గ్రామానికి చెందిన సత్యవరపు వెంకటబంగార్రాజు ఆటోలో 4వందల కేజీల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు నిందితుడిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు పట్టుబడిన బియ్యాన్ని సీఎస్‌డీటీ రామకృష్ణకు అప్పగించినట్లు వివరించారు.

ముగ్గురి అరెస్ట్‌

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా అక్రమ తయారీ, రవాణాను నిరోధించే కార్యక్రమంలో భాగంగా గురువారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కురుపాం ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద విలేకరులతో సీఐ మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో స్టేట్‌టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి దాడులు నిర్వహించగా 60 లీటర్ల సారాతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు చెప్పారు. అంతేకాకుండా గ్రామ పరిసరాల్లో పులియబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. అలాగే సారా తయారీ సామగ్రిని అమ్మిన ఓ మహళపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పై ముగ్గురినీ రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. గ్రామాల్లో సారా తయారీ రవాణా, అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ ఎస్సై జె.రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ దృష్టికి సమగ్ర శిక్ష అవినీతి ఆరోపణలు

సూపరింటెండెంట్‌పై ఆర్‌జేడీ విచారణ

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని సమగ్ర శిక్ష విభాగంలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆ ఆరోపణలు కలెక్టర్‌ దృష్టికి వెళ్లాయి. దీంతో ఆ విభాగంలోని ఒక సూపరింటెండెంట్‌పై విచారణకు విద్యాశాఖ ప్రాంతీయ సంయక్త సంచాలకుడు (ఆర్‌జేడీ)సిద్ధమయ్యారు. సంబంధిత సూపరింటెండెంట్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నుంచి ఆర్‌జేడీకి గురువారం ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఆ సూపరింటెండెంట్‌ను విశాఖలోని ఆర్‌జేడీ కార్యాలయానికి గురువారం రప్పించి విచారణ ప్రారంభించారు. అవినీతి ఆరోపణలలో నిజం లేదని నిరూపించుకోవడానికి ఒక రోజు గడువు ఇచ్చినట్లు తెలిసింది. నిరూపించకపోతే కలెక్టర్‌ నుంచి చర్యలు తప్పవని తెలుస్తోంది.

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌1
1/3

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌2
2/3

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌3
3/3

జాతీయ స్థాయి ప్రదర్శనలో గుంట్రెడ్డి కార్టూన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement