
ప్రజా వినతులకు సత్వర పరిష్కారం చూపాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన వినతులకు సత్వర పరిష్కారం చూపడంతో పాటు వాటిని అర్జీదారులు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా వినతులు పరిష్కరించేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని పద్ధతులను పాటిస్తూ వాటిని పరిష్కరిస్తున్నారా? లేదా? అనే అంశంపై వినతుల ఆడిట్ పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో అందిన వినతుల పరిష్కారంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినతుల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకాని జిల్లా అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్స్ చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ తదితరులు 143 వినతులు స్వీకరించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతలు బాధితుల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు పరిశీలించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు
చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా వినతులకు సత్వర పరిష్కారం చూపాలి