
నేటి నుంచి గ్రామస్థాయి యోగా శిక్షణ
● జాయింట్ కలెక్టర్ డాక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి యోగా శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమవుతుందని దీనికి ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారులకు జేసీ పలు సూచనలు చేశారు. ప్రతి సచివాలయానికి 9 మంది యోగా శిక్షకులను ఎంపిక చేశామని, వారి ద్వారా 3వ తేదీ నుంచి ఒక్కో బ్యాచ్కు 70 మంది చొప్పున 3 రోజుల యోగా శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. దీని కోసం ఎంపిక ఎంపిక చేసిన ప్రదేశాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఐదు రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే యోగా శిక్షకులుగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఇలా జూన్ 14 వరకు బ్యాచ్ల వారీగా శిక్షణ జరుగుతుందని గ్రామంలోని దాదాపు అందరికీ యోగా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు.