
జాతీయ తైక్వాండో పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: జాతీయస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్లో జరిగిన 9వ ఓపెన్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 8 మంది క్రీడాకారులు రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, 5 కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో కొల్లు హిమశీ, ఎస్.ఉదయ్వరుణ్లు బంగారు పతకాలు సాధించగా.. ఎం.శ్రీరామ్నాయుడు రజత పతకం దక్కించుకున్నాడు. అదేవిధంగా సోము శ్యామ్కుమార్, ఎస్.శ్యామ్శ్రీఽవర్ధన్, బి.సాయిచతైన్య, ఎ.గగన్దీప్, కె.శ్రీనివాసరావులు కాంస్య పతకాలు దక్కించుకున్న వారిలో ఉన్నారు. పతకాలు దక్కించుకున్న క్రీడాకారులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, చీఫ్ కోచ్ డీవీ చారిప్రసాద్, జిల్లా అసోసియేషన్ సభ్యులు పిల్లా శ్రీనివాస్, ఎస్.సతీష్కుమార్, టి.మురళీకృష్ణ, టి.వెంకటేష్ తదితరులు అభినందించారు.