యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Jun 2 2025 12:12 AM | Updated on Jun 2 2025 12:12 AM

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం

విజయనగరం క్రైమ్‌: సాలూరుకు చెందిన ఓ పత్రిక విలేకరి కొడుకు విజయనగరంలోని జొన్నవలస రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలూరులో 2019లో సీఐగా పనిచేసిన శ్రీనివాస్‌ పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌కు ఆ విలేకరి ఫోన్‌ చేసి తన కొడుకు విజయనగరంలో రైల్వేట్రాక్‌ వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో సందేశం పెట్టాడని, తన కొడుకును కాపాడాలంటూ వేడుకున్నారు. దీంతో ప్రస్తుతం విజయనగరం వన్‌టౌన్‌ సీఐగా ఉన్న శ్రీనివాస్‌ విలేకరి ఫోన్‌ చేయగానే సరాసరి జొన్నవలస రైల్వేగేట్‌కు వెళ్లారు. అక్కడే కళ్లముందే రైల్వేట్రాక్‌పై యువకుడు పడుకోవడాన్ని చూసి వెనువెంటనే బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. వివరాలు అడిగితే తాను చనిపోవాలని అనుకుంటున్నానని , ఎందుకో కారణం చెప్పక పోవడంతో వన్‌టౌన్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం యువకుడి తల్లిదండ్రులను పిలిపించి స్టేషన్‌లోనే ఆ కుర్రాడికి వన్‌టౌన్‌ సీఐ తన బృందంతో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement