
జాతీయస్థాయి దివ్యాంగుల పోటీలకు తోషిని ఎంపిక
తెర్లాం: జాతీయస్థాయిలో జరగనున్న దివ్యాంగుల క్రీడల పోటీలకు తెర్లాం మండలకేంద్రానికి చెందిన అడ్డా తోషిని ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన తోషినిని శనివారం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారని తెర్లాం హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు సునీల్ ఆదివారం తెలిపారు. గత నెలలో ఏలూరు జిల్లా ఆరిగిపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పెషల్ ఒలింపిక్స్ భారత్ పోటీల్లో తోషిని బోసిగేమ్లో పాల్గొంది. ఈ ఆటలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించి గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు తోషిని ఎంపికై ంది. తోషిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తెర్లాం హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
సన్మానించిన జిల్లా మంత్రి శ్రీనివాస్