
పంటల బీమా ప్రీమియం తామే చెల్లించాం..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల తరఫున పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో పంట నష్టపోతే వెంటనే పరిహారం అందేది. రైతులకు సాగుభరోసా కలిగేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులనే బీమా ప్రీమియం కట్టుకోమని చెప్పింది. రబీలో అపరాలకు తామే బీమా ప్రీమియం చెల్లించుకున్నాం. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్కరూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు.
– వెలగాడ రామసూర్యం, రైతు, కొత్త వెలగాడ గ్రామం