అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టాక ఖరీఫ్‌, రబీ సీజన్‌లు పూర్తయ్యాయి. వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరుమార్చారే తప్ప పైసా పెట్టుబడి సాయం విదల్చలేదు. 2025 ఖరీఫ్‌ సీజన్‌ ఆసన్నమై సాగు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టాక ఖరీఫ్‌, రబీ సీజన్‌లు పూర్తయ్యాయి. వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరుమార్చారే తప్ప పైసా పెట్టుబడి సాయం విదల్చలేదు. 2025 ఖరీఫ్‌ సీజన్‌ ఆసన్నమై సాగు

Jun 1 2025 12:49 AM | Updated on Jun 1 2025 12:49 AM

అన్నద

అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు.

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైనా అందని పెట్టుబడి సాయం

విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక విలవిల

వైఎస్సార్‌ రైతుభరోసా పథకానికి

పేరుమార్పేతప్ప సాయం శూన్యం

ఉచిత పంటల బీమా పథకానికి

మంగళం

రైతులే బీమా ప్రీమియం

చెల్లించుకోవాల్సిన దుస్థితి

గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రైతుభరోసా కింద రూ.1466.96 కోట్లు సాగుసాయం

పంటల బీమా కింద రూ.33 కోట్ల చెల్లింపు

విజయనగరం ఫోర్ట్‌:

నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వరి విత్తనాలు జల్లేందుకు నారు మడులు, వెద పొలాలను సిద్ధం చేస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ , తదితర మెట్ట పంటల సాగుకు ఉపక్రమించారు. అయితే, విత్తనాలు కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేక పోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే సాగు పెట్టుబడికి ఆర్థిక సాయం ఠంచన్‌గా అందజేస్తామని కూటమి సర్కా రు గొప్పలు చెప్పిందని, గద్దె నెక్కిన మొదటి ఏడా దే రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శిస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలును తక్షణమే అందజేయాని డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సాగుసాయం ఏటా సీజన్‌వారీగా అందేది. ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు అధిక ప్రయోజనం కలిగేది. ప్రభుత్వ భరోసాతో సాగుపై ఆసక్తి చూపేవారు. నేడు ఆ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామంటున్నారు.

ఐదేళ్లలో రూ.1466.96 కోట్లు అందజేత

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2023 వరకు ఐదేళ్లలో రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌’ కింద రూ.1466.96 కోట్ల సాగుసాయం అందింది. పంటల బీమా కింద ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో నాలుగేళ్లలో రూ. 33.08 కోట్ల పరిహారం అందించింది.

అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు. 1
1/2

అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు.

అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు. 2
2/2

అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement