
సారా రహిత విజయనగరం
విజయనగరం టౌన్: జిల్లా అబ్కారీ శాఖ అందించిన సమాచారం విజయనగరం జిల్లాను సారా రహిత ప్రాంతంగా ప్రకటిస్తూ నవోదయం కమిటీలో తీర్మానం చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టరేట్లోని నవోదయం 2.0 అమలుపై శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మద్యం బెల్టు షాపులు అధికంగా ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదుచేయాలన్నారు. జిల్లాలోని 27 మండలాలు 771 రెవెన్యూ గ్రామాల పరిధిలో 26 సారా ప్రభావిత గ్రామాలను గుర్తించామని, 414 పాత ముద్దాయిలను, 26 మంది బెల్లం వర్తకులను గుర్తించి బైండోవరు చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. సమావేశంలో ఎౖకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కేవీవీఎన్ బాబ్జీరావు, సహాయ సూపరింటెండెంట్ దొర, డీఎంహెచ్ఓ జీవనరాణి, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మద్యం బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు
కలెక్టర్ అంబేడ్కర్