
రూపాయి ఇవ్వలేదు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. – ఆర్.దేవుడు, రైతు, పెదవేమలి గ్రామం
రైతన్నకు కష్టకాలం
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు కష్టకాలం మొదలైంది. ఏటా పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమాతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోంది.
– తలారి బ్రహ్మ, రైతు, తమ్మారాయుడుపేట, గజపతినగరం

రూపాయి ఇవ్వలేదు..