
విధుల్లో అంకితభావంతోనే గుర్తింపు : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో ఉన్నతాధికారులు వివిధ రూపాల్లో తమ విధుల్లో నైపుణ్యత చూపి చేసిన సేవలు చిరస్థాయిగా పలువురికి ఆదర్శంగా, ఆచరణీయంగా ఉంటూ పదిలంగా ఉంటాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన మెట్ట సుదర్శన వెంకటప్రసాద్ను శనివారం ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 40ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి, శాఖపై ప్రజలకు మరింత భరోసా కల్పించిన వారి గుర్తింపు చిరస్థాయిగా ఉంటుందని ఎస్పీ అన్నారు. పోలీసు శాఖ వారి కుటుంబానికి అవసరమైనపుడు ఆదుకొనేందుకు సిద్ధంగా ఉంటుందని అన్నారు. పదవీ విరమణ పొందిన ఎస్ఐకు ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఎస్పీ ఎస్ఐ దినకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.