మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో | - | Sakshi
Sakshi News home page

మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో

Jun 1 2025 12:49 AM | Updated on Jun 1 2025 12:49 AM

మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో

మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో

పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలో మలేరియా, డెంగీ కేసులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ కేసులు ఉండరాదని, వాటి నివారణకు పూర్తి చర్యలు తీసుకోవాలని, అలాగే పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐఎంఆర్‌, ఎన్‌ఎంఆర్‌ మరణాల రేటును తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీవో తేల్చి చెప్పారు. ఈ విషయంలో వైద్యాధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎస్‌.భాస్కరరావు, ఉప జిల్లా వైద్యశాఖాధికారి కేవీఎస్‌ పద్మావతి, జిల్లా మలేరియా అధికారి వై.మణి, ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. ఎం.వినోద్‌కుమార్‌, ఐటీడీఏ పరిధిలో వున్న మండలాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement