
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 మందిపై ఒక్క రోజులోనే కేసులు నమోదు చేసి విజయగరం అడిషనల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఎంఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి ఒకొక్కరికి రూ.10వేల చొప్పున మొత్తం 49 మందికి రూ.4.90 లక్షల జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు.
ప్రశాంతంగా ఎస్జీటీల కౌన్సెలింగ్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం జరిగింది. ఎస్జీటీ 37, ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ పోస్టులు ముగ్గురికి చొప్పున బదిలీ చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏపీవో చిన్నబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఏఎంవో కోటిబాబు, సీఎంవో చిరంజీవీ, జీసీడీవో రాములమ్మ, హెచ్ఎంలు పి.నారాయుడు, సూర్యం తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రేషన్ డిపోల వద్ద సరుకులు
పార్వతీపురం టౌన్: నేటి నుంచి రేషన్ డిపోల వద్ద సరుకులు పంపిణీ చేయనున్నట్టు జీసీసీ మేనేజరు ఎం.సాంబశివురావు అన్నారు. ఈ మేరకు శనివారం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జీసీఎంఎస్ బ్రాంచి పరిధిలో 17 డిపోల సేల్స్మెన్స్, గోదాముల సూపర్వైజరు్ల్ ఆదివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి వుంచాలన్నారు. వినియోగదారులకు ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా పంపిణీ చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరించారు. జీసీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆటో బోల్తా..
శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర పంచాయతీ ధారపర్తి పరిధిలో పల్లపు దుంగాడ నుంచి దబ్బగుంటకు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సమయంలో ఆటోలో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
విజయనగరం క్రైమ్: నగరంలోని పూల్బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న కారు పూల్బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద వెనుక నుంచి వస్తూ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో రావివలస పంచాయతీకి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టు టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా