
పిడుగుపాటుతో యువకుడి మృతి
వేపాడ: మండలంలోని కృష్ణారాయుడు పేట గ్రామానికి చెందిన సిమ్మ శ్రీనివాసరావు (33) శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పశువులను గ్రామ సమీపంలో ఎర్రబంద వద్ద మేపుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి తల్లి కృష్ణమ్మ ఇద్దరి చెల్లెళ్లు భాగ్య, లావణ్య ఉన్నారు.
మరో రెండు పాడి ఆవులు..
లక్కవరపుకోట/కొత్తవలస: లక్కవరపుకోట మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో రెండు పాడిఆవులు మృతిచెందాయి. మార్లాపల్లి గ్రామానికి చెందిన గోగాడ దేముడు, ఖాసాపేట గ్రామానికి చెందిన నెల్లి అప్పలనాయుడుల రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతిచెందాయి.

పిడుగుపాటుతో యువకుడి మృతి

పిడుగుపాటుతో యువకుడి మృతి