
యోగాంధ్రలో వైద్యశాఖ మమేకం
పార్వతీపురంటౌన్: యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ పాల్గొంటుందని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమం శనివారం పార్వతీపురం లయన్స్ క్లబ్లోను, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, పాలకొండలోని రామ కళామందిర్ థియేటర్ దగ్గర గల గాయత్రి కల్యాణ మంటపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శారీరక, మానసిక ఉల్లాసం, ఒత్తిడి తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
డీఎంహెచ్ఓ ఎస్.భాస్కర రావు