చర్యలు తీసుకుంటాం.. | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకుంటాం..

May 30 2025 1:13 AM | Updated on May 30 2025 1:13 AM

చర్యల

చర్యలు తీసుకుంటాం..

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం కచ్చితంగా డాక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్‌తో పాటు సిబ్బంది అందరూ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో ఉండాలి. డాక్టర్‌ లేకుండా ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కార్యక్రమం మధ్యలో వెళ్లినట్టు తెలిసినా చర్యలు తీసుకుంటాం.

ఫొటోలో కనిపిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం మెంటాడ మండలం చల్లపేట పీహెచ్‌సీ పరిధి పెదచామలపల్లి గ్రామంలో జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్‌ లేకుండానే గురువారం ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లోనే కాదు. అనేక చోట్ల ఇటువంటి పరిస్థితే ఉందని పల్లెప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోస్తున్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌... ఐదేళ్ల కిందటి వరకు ధనవంతులకే పరిమితమైన వైద్యం. దానిని గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పల్లె ప్రజలకు చేరువచేసింది. పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించి పల్లెలకు పంపించింది. రోగులకు వైద్యపరీక్షలు జరిపించి అవసరమైన మందులు అందజేసేది. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో త్వరగా నయమయ్యేవి. రోగులకు రూపాయి ఖర్చుకాకుండా, ఇంటి వద్దనే మెరుగైన వైద్య సేవలు, మందులు అందేవి. చాలామందికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పేది. ఇంతటి ప్రాధాన్యమున్న ఫ్యామిలీ డాక్టర్‌ వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు లేని శిబిరాలు నిర్వహిస్తూ సేవలందించడంపై జనం మండిపడుతున్నారు. సీజనల్‌ జ్వరాలతో సతమతమవుతున్నా వైద్యులు లేకుండానే శిబిరాలు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. వృద్ధులు, దివ్యాంగులైన రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ఆపసోపాలు

పడుతున్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ వైద్యంపై కూటమి నిర్లక్ష్యం

వైద్యులు పూర్తిస్థాయిలో ఉండడంలేదనే

ఆరోపణలు

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం నిర్వహించాలి

కొన్ని ప్రాంతాల్లో వైద్యులు లేకుండా నిర్వహణ

మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంట, 2 గంటలకే వైద్యులు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు

గతంలో నెలకు 1.30 లక్షల మందికి సేవలు

ఇప్పుడు 90 వేల నుంచి 1.10 లక్షల మందికే పరిమితం!

విజయనగరం ఫోర్ట్‌:

దైనా జబ్బు చేస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు మండల కేంద్రంలో ఉన్న పీహెచ్‌సీకి, లేదంటే జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. నడవలేని వారిని తీసుకెళ్లడం మరింత కష్టమయ్యేది. వ్యయప్రయాసలకు గురయ్యేవారు. ఇటువంటి వారి కష్టాలు తీర్చేలా.. పల్లె ముంగిటకే వెళ్లి వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం చేపట్టింది. గ్రామాలకు, నడవలేని వారి ఇళ్లకు వెళ్లి నిపుణులైన వైద్యులు సేవలు అందించడం వల్ల రోగుల ఆరోగ్యం కుదుటపడేది. ప్రాథమిక దశలోనే వ్యాధు లు గుర్తించి సేవలు అందించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గేవి. ఇంతటి ప్రాధాన్యమున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంపై పెద్దగా శ్రద్ద చూపకపోవడం వల్ల లక్ష్యం నేరవేరడం లేదని పల్లె ప్రజలు వాపోతున్నారు.

● ఫ్యామిలీ డాక్టర్‌ సేవలందించాల్సింది ఇలా...

జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని 104 వాహనాలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 54 పీహెచ్‌సీల పరిధిలో 46 వాహనాలు ఉన్నాయి. ప్రతిరోజు పీహెచ్‌సీ పరిధిలో ఒక గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్య క్రమాన్ని నిర్వహిస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో వైఎస్సా ర్‌ విలేజ్‌ క్లినిక్‌లో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరానికి వచ్చిన రోగులను వైద్యుడు తనిఖీ చేయాలి. మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ బీపీ, సుగర్‌ పరీక్షలు, 104 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ శిబిరానికి వచ్చిన రోగులకు అందించిన చికిత్స వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. గర్భిణులకు తనిఖీలు నిర్వహించి, బీపీ, సుగర్‌, హెచ్‌బీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ చేయాలి. ఒంటి గంటనుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది. 2 గంటల తర్వాత పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను తనిఖీ చేయాలి. ఆ తర్వాత మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించి వారికి వైద్య సేవలు అందించాలి.

వైద్యులు లేకుండా సేవలు ఎలా..?

జిల్లాలో చాలా చోట్ల డాక్టర్‌ లేకుండా ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ప్రజలు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు హాజరైనా మధ్యాహ్నం ఒంటి గంట, రెండు గంటలకే ఇంటిదారి పడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ శిబిరాలకు వెళ్లేందుకు రోగులు అంతగా అసక్తి చూపడం లేదు. మెరుగైన వైద్యసేవలు అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు భరోసా కల్పించే వైద్యసేవలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు.

చర్యలు  తీసుకుంటాం..  
1
1/2

చర్యలు తీసుకుంటాం..

చర్యలు  తీసుకుంటాం..  
2
2/2

చర్యలు తీసుకుంటాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement