దొరికిన దొంగల ముఠా | - | Sakshi
Sakshi News home page

దొరికిన దొంగల ముఠా

May 30 2025 1:13 AM | Updated on May 30 2025 1:13 AM

దొరిక

దొరికిన దొంగల ముఠా

పోలీసుల పనితీరు భేష్‌

చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకోవడంలో సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ జి.శంకరరావు, ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమని డీఎస్పీ ఎస్‌.రాఘవులు అన్నారు. 23న చోరీ జరగగా, 24న రాత్రి నిందితులను గుర్తించామని, విచారణ నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని దుండగులను అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీస్‌ సిబ్బందికి రివార్డులు కోసం ప్రతిపా దిస్తామని స్పష్టం చేసారు.

చీపురుపల్లి: చీపురుపల్లి మెయిన్‌ రోడ్డులో, పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ఇంటిలో చొరబడి.. ఇద్దరు వృద్ధులను గాయపరిచి చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం పది మందిలో 8 మంది అరెస్టుకాగా, మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన వివరాలను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎస్‌.రాఘవులు వెల్లడించారు. ఎలాంటి కష్టం లేకుండా రూ.వందల కోట్లు కొల్లగొట్టాలనే అత్యాశతో ఈ నెల 23న అర్థరాత్రి దాటిన తరువాత పట్టణంలోని మెయిన్‌రోడ్‌లోని వారణాళి సురేష్‌ నివాసంలో చోరీకు పాల్పడ్డారు. వీరికి ఆ స్థాయిలో డబ్బు, బంగారం దొరకలేదు. వృద్ధులను గాయపరిచి వారి మెడలోని బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ దొంగల ముఠా ఇక్కడ మాత్రమే కాదు గతంలో జరిపిన చోరీల్లో సైతం విఫలయత్నమే చేశారు తప్ప ఎక్కడా చోరీలు సఫలీకృతమవ్వలేదు. చీపురుపల్లిలో చోరీ ఘటనకు ప్రధాన సూత్రధారి మండలంలోని గత్సలవలస గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మన్నెల సూర్యారావు. గ్రామంలో టీడీపీ ప్రధాన కార్యకర్తగా చలామణిలో ఉన్నాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

వీడియోలు, ఫొటోలు

టీడీపీ కార్యకర్త ద్వారానే...

సూర్యారావు ఇచ్చిన సమాచారంతోనే ముఠా చోరీకు పాల్పడినట్లు డీఎస్పీ రాఘవులు వెల్లడించారు. చోరీ జరిగిన ఇంటిలో రూ.300 కోట్లు వరకు నగదు, 350 కేజీల వరకు బంగారం లభిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లాలో కూనేరులో ఉన్న ఆశీస్‌ జగం అలియాస్‌ జగన్‌ అనే వ్యక్తికి సూర్యారావు సమాచారం అందించాడు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి పంపించాడు. దానిని జగన్‌ తిరిగి విజయనగరంలోని సావిత్రి అలియాస్‌ జ్యోతి అనే మహిళకు పంపించాడు. ఆమె శ్రీకాకుళం జిల్లాలోని దేవరాపల్లిలో ఉన్న ఆచంట వెంకటేష్‌కు పంపించింది. వెంకటేష్‌ నుంచి విజయనగరంలోని బొల్లవరపు నాగరాజుకు సమాచారం చేరింది. అదే వెంకటేష్‌ బాపట్లలోని నాజుల్‌ బాబు అలియాస్‌ డైమండ్‌ బాబు అనే కీలక నిందితునికి సమాచారం ఇచ్చారు. ఆయన నుంచి వంగర శ్రీనివాసరావు, శ్యామ్‌కుమార్‌లకు సమాచారం ఇచ్చారు. ఇలా మొత్తం పది మంది కలిసి చోరీకు ప్రణాళిక రచించారు. వీరిలో పట్టుబడిన 8 మంది నుంచి 5 తులాలు బంగారం, ఎనిమిది సెల్‌ఫోన్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, చోరీలో ఇద్దరు వృద్ధులను గాయపరిచి వారి నుంచి పదిహేడున్నర తులాల బంగారం అపహరించుకుపోయినట్లు వారణాళి కస్తూరి, వైశ్యరాజు చిట్టెమ్మల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రం దుండగలు నుంచి కేవలం 5 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

చోరీ కేసులో

అదుపులోకి తీసుకున్నది

వీరినే...

చోరీకి ప్రధాన సూత్రధారి టీడీపీ

కార్యకర్త సూర్యారావు

ఆయన సూచనలతోనే చోరీ ప్రణాళిక

చోరీలో పాల్గొన్న పదిమందిలో

8 మందిని పట్టుకున్న పోలీసులు

మిగిలిన ఇద్దరి కోసం గాలింపు

5 తులాల బంగారం రికవరీ

నిందితుల సెల్‌ ఫోన్లు, కారు స్వాధీనం

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల చోరీకి పాల్పడిన ముఠా

వివరాలు వెల్లడించిన డీఎస్పీ

రాఘవులు

నాజుల్‌ బాబు అలియాస్‌ డైమండ్‌ బాబు అలియాస్‌ వజ్రాల బాబు, కుమ్మరిగుంట శ్యామ్‌కుమార్‌, వంగర శ్రీనివాసరావు, ఆచంట వెంకటేష్‌, బొల్లవరపు నాగరాజు, దాసు సావిత్రి అలియాస్‌ జ్యోతి, ఆశిస్‌ జగం అలియాస్‌ జగన్‌, మన్నేల సూర్యారావు. తేల్లి కిషోర్‌, మనోజ్‌లు దొరకాల్సి ఉంది. వీరిపై 310(2), 310(5), 311, 331(8) సెక్షన్ల్‌ కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

దొరికిన దొంగల ముఠా 1
1/3

దొరికిన దొంగల ముఠా

దొరికిన దొంగల ముఠా 2
2/3

దొరికిన దొంగల ముఠా

దొరికిన దొంగల ముఠా 3
3/3

దొరికిన దొంగల ముఠా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement