వేతనదారులకు నష్టం జరిగితే సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

వేతనదారులకు నష్టం జరిగితే సహించేది లేదు

May 29 2025 1:19 AM | Updated on May 29 2025 1:19 AM

వేతనదారులకు నష్టం జరిగితే సహించేది లేదు

వేతనదారులకు నష్టం జరిగితే సహించేది లేదు

కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం ఫోర్ట్‌: ఉపాధిహామీ వేతనదారులకు నష్టం జరిగే చర్యలను సహించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించాలన్నారు. ఈ వారంలో రూ.250 వరకు వేతనం పెరిగేలా చూడాలన్నారు. ఇప్పటివరకు 70లక్షల23 వేల పనిదినాలను సృష్టించారని, ఇది కేవలం 63 శాతం మాత్రమేనని, మిగిలిన మూడు రోజుల్లో శతశాతం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. తక్కువ పనిదినాలు కల్పించిన ఏపీఓలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement