పైడితల్లమ్మవారికి జెడ్పీ చైర్మన్‌ ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

పైడితల్లమ్మవారికి జెడ్పీ చైర్మన్‌ ప్రత్యేక పూజలు

May 28 2025 12:18 AM | Updated on May 28 2025 12:18 AM

పైడితల్లమ్మవారికి జెడ్పీ చైర్మన్‌ ప్రత్యేక పూజలు

పైడితల్లమ్మవారికి జెడ్పీ చైర్మన్‌ ప్రత్యేక పూజలు

● పైడితల్లమ్మకు జెడ్పీ ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు

విజయనగరం: కార్పొరేషన్‌ పరిధిలోని ధర్మపురి గ్రామంలో వెలసిన పైడితల్లమ్మవారికి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కుటుంబసమేతంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లదనోత్సవంలో భాగంగా సతీమణి ఆయన పుష్పాంజలి, కుమార్తె సిరిసహస్ర, అల్లుడు ప్రదీప్‌ నాయుడులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చల్లనితల్లి పైడితల్ల మ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ధర్మపురిలో వెలసిన పైడితల్లమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement